photo gallery

 

Tuesday, June 2, 2015

చంద్రబాబును ఏ1 ముద్దాయిగా పెట్టాలి'

రేవంత్ రెడ్డి వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, శాసనసభ పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రాజమండ్రిలో జ్యోతుల నెహ్రు మాట్లాడారు. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ 1 ముద్దాయిగా పెట్టాలన్నారు. ఈ వ్వవహారాన్ని అవసరమైతే సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ సీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు. 

No comments:

Post a Comment