రేవంత్ రెడ్డి వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే,
శాసనసభ పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం రాజమండ్రిలో జ్యోతుల నెహ్రు మాట్లాడారు. ఈ కేసులో ముఖ్యమంత్రి
చంద్రబాబును ఏ 1 ముద్దాయిగా పెట్టాలన్నారు. ఈ వ్వవహారాన్ని అవసరమైతే
సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి
వ్యవహారంలో చంద్రబాబు ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ
వ్యవహారంపై వైఎస్ఆర్ సీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు.
No comments:
Post a Comment