photo gallery

 

Wednesday, March 4, 2015

చంద్రబాబు.. ఆ నేతలను ఎంతకు కొన్నారో?

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ కు చంద్రబాబు చేసింది ఏమీలేదని ఆయన బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో అన్నారు. హైదరాబాద్ ను గుడిసెల నగరంగా మార్చింది చంద్రబాబేనని... వ్యవసాయం దండగ అన్న బాబు... ఇప్పుడు వ్యవసాయంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇతర పార్టీ నేతలను టీఆర్ఎస్ కొంటుందని తమపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు ...ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ఎస్ పీవై రెడ్డి, జూపూడి ప్రభాకర్ లాంటి నేతలను ఎంతకు కొన్నారో చెప్పాలని కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment