వ్యవ‘సాయం’ వెక్కిరించడంతో పురుగు మందు తాగి ప్రాణాలొదిలింది ఒకరు.. ఎండుతున్న పంటలను చూసి గుండెమండి మరణించిందొకరు.. దిగుబడి రాక, అప్పులు తీర్చలేక ఉరితాడుకు వేలాడిందొకరు.. కారణమేదైనా.. సమాజానికి అన్నం పెట్టే రైతన్నల నిండుప్రాణాలు నిలువునా నీరుగారుతున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి (2014 జూన్ 2 నుంచి) ఇప్పటిదాకా మరణించిన రైతులెందరో తెలుసా? టీఆర్ఎస్ సర్కారు చెబుతున్నట్లుగా 130 మంది మాత్రం కాదు.. ఆ సంఖ్య 760 వరకూ ఉండొచ్చని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఆత్మహత్యల్ని శాస్త్రీయంగా లెక్కించకపోవడం వల్లే బలవన్మరణాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలు కకావికలవుతున్నాయి.
No comments:
Post a Comment