ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఓ వైపు చెబుతూనే మరోవైపు ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చు పెట్టడం చూస్తే ఆయన చంద్రబాబు కాదు, దుబారా బాబు అనిపిస్తోందని విమర్శించారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయామని, రాజధాని ఏర్పాటుకు, రాష్ట్ర పునర్నిర్మాణానికి డబ్బులు లేవని చంద్రబాబు ముఖ్యమంత్రి గద్దెనెక్కిన నాటినుంచీ చెబుతూనే ఉన్నారన్నారు.
No comments:
Post a Comment