photo gallery

 

Tuesday, May 5, 2015

ముఖ్యమంత్రి రాక రేపు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 6న జిల్లాకు రానున్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటించనున్న సీఎం,   తోటపల్లి ప్రాజెక్టు పనులకు కూడా పరిశీలిస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు హెలికాఫ్టర్‌లో విజయనగరం చేరుకుని, తోటపల్లి ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా లక్షా 20వేల ఎకరాలకు సాగునీటిని ఈ ఖరీఫ్ నాటికే ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు  ప్రకటించారు. దీనిపై పలు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా చేయాలని, త్వరలోనే ఈ ప్రాజెక్టుపనులను పరిశీలిస్తానని కూడా చంద్రబాబు ఇటీవలే అన్నారు. 

No comments:

Post a Comment