ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 6న జిల్లాకు రానున్నారు. నీరు-చెట్టు
కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటించనున్న సీఎం, తోటపల్లి ప్రాజెక్టు
పనులకు కూడా పరిశీలిస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు హెలికాఫ్టర్లో
విజయనగరం చేరుకుని, తోటపల్లి ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తారు. తోటపల్లి
ప్రాజెక్టు ద్వారా లక్షా 20వేల ఎకరాలకు సాగునీటిని ఈ ఖరీఫ్ నాటికే ఇస్తామని
ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. దీనిపై పలు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా
స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా చేయాలని, త్వరలోనే ఈ
ప్రాజెక్టుపనులను పరిశీలిస్తానని కూడా చంద్రబాబు ఇటీవలే అన్నారు.
No comments:
Post a Comment