:జూన్ నెలాఖరుకు అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు పూర్తి చేయాలని,
దీనికి కళాశాలల యాజమాన్యాలు సిద్ధం కావాలని జేఎన్టీయూకే వైస్ చాన్స్లర్
వీఎస్ఎస్ కుమార్ సూచించారు. విజయనగరం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో
విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల
యాజమాన్యాలతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన
మాట్లాడుతూ వచ్చే నెలలో చేపట్టనున్న ఇంజినీరింగ్ ప్రవేశాలకు అన్ని
కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఇటీవల నిర్వహించిన ఎంసెట్-2015
ఫలితాలను ఈ నెల 21న విడుదల చేయనున్నట్టు చెప్పారు.
No comments:
Post a Comment