కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు చమురు కంపెనీలతో కుమ్మక్కై ప్రజలను దోచుకుంటున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి యడ్ల రమణమూర్తి ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని కాం గ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దారుణమన్నారు. దీని వల్ల ప్రజలపై మరింత భారం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై 4 శాతం ట్యాక్స్ విధించడం వల్ల వినియోగదారులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. ధరల పెంపును నిరసిస్తూ... కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఆయనతో పాటు ఆ పార్టీ నాయకులు యడ్ల ఆదిరాజు, రొంగలి పోతన్న, కందిసాయి జగ్గారావు, కనకల రఘురామ్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment