మీకు అన్నివిధాలా అండగా ఉంటానని.. అధైర్యపడొద్దని.. ఎలాంటి ఆందోళన
పెట్టుకోవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధినేత, ఏపీ శాసనసభ
ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మృతుని కుటుంబానికి భరోసా ఇచ్చారు.
మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన ధనికెల రఘురాం ఈనెల 18వ తేదీన తోట
వద్ద విద్యుత్ షాక్తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్, కడప
ఎంపీవైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్
వివేకానందరెడ్డిలతో కలిసి శనివారం తుమ్మలపల్లె గ్రామానికి చేరుకున్నారు.
మృతుడు ధనికెల రఘురాం భార్య భారతి, తండ్రి చిన్ననారాయణలను ఓదార్చారు.
No comments:
Post a Comment