ప్రభుత్వ ఉద్యోగులతో పాటు
తమకూ 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె
మూడో రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా పలుచోట్ల తాత్కాలిక, శాశ్వత ఉద్యోగుల
మధ్య ఘర్షణకు కొనసాగాయి. పలు చోట్ల పోలీసుల పహారా నడుమ బస్సులను
నడిపించారు. కొన్ని డిపోల్లో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు దిష్టిబొమ్మను
కార్మికులు దహనం చేశారు. 43శాతం ఫిట్మెంట్ ఇచ్చే వరకు సమ్మెను ఆపేది
లేదని కార్మిక సంఘాలు నేతలు స్పష్టం చేశారు. బస్సులు లేకపోవడంతో
ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
No comments:
Post a Comment