ఏడాది కాలంగా మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడు వైఖరిని ఎండగట్టి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని
ఒత్తిడి చేయడానికే ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి సమర దీక్ష
నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జూన్ 3, 4
తేదీల్లో రెండు రోజుల పాటు మంగళగిరిలో తలపెట్టిన జగన్మోహన్రెడ్డి
సమరదీక్షకు సంబంధించిన పోస్టర్ను పార్టీ నేతలు శుక్రవారంనాడిక్కడ పార్టీ
రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
No comments:
Post a Comment