photo gallery

 

Tuesday, May 5, 2015

ప్రపంచ బౌద్ధ క్షేత్రంగా సాగర్‌: కేసీఆర్‌

ప్రపంచంలోని బౌద్ధులంతా నాగార్జునసాగర్‌ వెళ్లిరావాలనుకునే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని, తెలంగాణలో గొప్ప పర్యాటక కేంద్రంగా నాగార్జునసాగర్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌ శ్రీపర్వతరామ- బుద్ధవనం అభివృద్ధికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తామని, స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. బుద్ధ జయంతిని పురస్కరించుకొని ఆయన సోమవారం నాగార్జున సాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. గౌతమ బుద్ధుడి స్మారకం వద్ద విగ్రహం వద్ద పుష్పాలు ఉంచారు. బౌద్ధ స్థూపం ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రాంగణంలో మొక్కలు నాటారు. బుద్ధవనం అభివృద్ధికి యాదాద్రి తరహాలో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శ్రీలంక ప్రభుత్వం బహూకరించిన 27 అడుగుల బుద్ధ విగ్రహాన్ని కూడా మంచి స్థానంలో నిలపాలని కేసీఆర్‌ సూచించారు.

No comments:

Post a Comment