ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హమీలను అమలు చేస్తున్నామని పలువురు
రాష్ట్ర మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారని, అసలు వారేం చేశారో ప్రజల
ముందుకు వచ్చి చెప్పాలని శాసనమండలి సభ్యుడు, వైఎస్ఆర్ సీపీ జిల్లా
అధ్యక్షుడు కోలగట్ల.వీరభద్రస్వామి సవాల్ చేశారు. ఈ మేరకు ఆదివారం తన
స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోలగట్ల మాట్లాడారు.
ఎన్నికలకు ముందు అమలుకు వీలుకాని హామీలు గుప్పించి ప్రజలను మోసం చేసి
గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వం ఆ హమీలను నెరవేర్చాల్సిందేనని డిమాండ్
చేశారు. ప్రభుత్వం పాలన ప్రారంభించిన ఏడాది కాలంలో ఇప్పటికీ
మోసపూరితంగానే నడుచుకుంటోందని మండిపడ్డారు.
No comments:
Post a Comment