ఏడాది పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలను ఎండగట్టేందుకే ప్రతిపక్ష నేత
వైఎస్ జగన్మోహన్రెడ్డి జూన్ మొదటివారంలో విజయవాడ-గుంటూరు పరిసరాల్లో
దీక్ష చేయబోతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు
తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో
మాట్లాడారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విషయంలో ఏడాదిపాటు ప్రజలను మోసం
చేసింది చాలక టీడీపీ విజయ యాత్ర, నవనిర్మాణ దీక్ష, నూతన రాజధానికి
శంకుస్థాపన వంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్
చేశారు.
No comments:
Post a Comment