photo gallery

 

Friday, May 8, 2015

ఏపీ ఎంసెట్‌ పరీక్ష ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 255142 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఎంసెట్‌ పరీక్ష కోసం ఏపీలో 455, హైదరాబాద్‌లో 35 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగనుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు మెడిసిన్‌ పరీక్ష జరుగనుంది. ఆర్టీసీ సమ్మెను సవాల్‌గా తీసుకున్న యంత్రాంగం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రాలకు సజావుగా చేరుకున్నారు. అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment