photo gallery

 

Wednesday, January 21, 2015

బాబు ఎన్టీఆర్‌ను పొగిడితే అసహ్యించుకుంటారు

దివంగత ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించివేసి ఆయన మరణానికి కారకుడైన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగిడితే ప్రజలు అసహ్యించుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరి గౌతంరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు.

పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన్ని అనేక ఇబ్బందులకు గురిచేసిన చంద్రబాబు ఇప్పుడు ఊసరవెల్లిగా మారి ఆయన్ని కీర్తించటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

No comments:

Post a Comment