ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారులు కొత్త కాన్వాయ్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్కుమార్రెడ్డి కోసం ఇంటెలిజెన్స్ పోలీసులు నాలుగు ఫార్చూనర్ కార్లను కొనుగోలు చేశారు. అయితే రాష్ట్ర విభజనతో రెండు తెలంగాణకు, మరో రెండు ఏపీకి కేటాయించారు. వీటికి మరో నాలుగు అదనంగా కొనుగోలు చేసిన ఏపీ పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కొత్తకాన్వాయ్ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకూ వాడిన పాత కాన్వాయ్ను విజయవాడకు తరలించే ఆలోచన చేస్తున్నారు.
No comments:
Post a Comment