photo gallery

 

Wednesday, January 28, 2015

చంద్రబాబు అగ్రిమెంట్ రాసివ్వాలి- భూమా అఖిలప్రియ

నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలతో అగ్రిమెంట్ చేయాలని ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో మంగళవారం  ఆమె మాట్లాడుతూ...ప్రాజెక్టు పూర్తి చేయకుంటే తనదే బాధ్యత అని చంద్రబాబు అగ్రిమెంట్లో రాయాలన్నారు. దానితో పాటు అగ్రిమెంట్ కాపీని గవర్నర్ కు సమర్పించాలని తెలిపారు.

ప్రజాధనం దుర్వినియోగం వెనుక మంత్రుల వాటాలెంతో బయటపట్టాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అంజద్ బాషా, నారాయణ స్వామి లు ఈ సందర్భంగా  డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment