photo gallery

 

Tuesday, January 6, 2015

బాబు అధికారం రెండేళ్లే

జోస్యులూ అదే చెబుతున్నారు
తర్వాత రాష్ట్రానికి నేనే సీఎం
రాజధాని రైతుల బాధ వింటుంటే
గుండె తరుక్కుపోతోంది: జగన్‌
 జ్యోతిష్కులు కూడా అదే చెబుతున్నారు
 తర్వాత రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి
 రాజధాని రైతుల బాధలు వింటుంటే
నా గుండె తరుక్కుపోతోంది
 మంగళగిరి, తాడేపల్లి రైతులతో జగన్‌

 ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ కాలం, తాను ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించే అవకాశాలపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారం ఉందని చెప్పి తన ఇష్టం వచ్చినట్లు చెయ్యొచ్చు. కానీ ఈ అధికారం ఉండేది రెండు సంవత్సరాలే. జ్యోతిష్కులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఒకవేళ దేవుడు అనుకూలిస్తే నాలుగేళ్లు ఉండొచ్చు. ఏం చేసినా ఆ అధికారం పోయేలోపే. నేను హామీ ఇస్తున్నా.. ప్రతీ రైతుక్కూడా చెబుతున్నా.. మీకందరికీ అంగీకారమైతేనే భూములు తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే చంద్రబాబు కాదుగదా.. వాళ్ల నాయనా వచ్చినా కూడా తీసుకోలేడు’’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment