photo gallery

 

Monday, December 22, 2014

గుర్రాలతో తొక్కించిన బాబు...మళ్లీ అదే దమననీతి

హైదరాబాద్ : కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అంశంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐకేపీ యానిమేటర్ల అరెస్ట్కు నిరసనగా వైఎస్ఆర్ సీపీ సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.
అనంతరం ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్  వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఐకేపీ యానిమేటర్లు వంద రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. హైదరాబాద్ ధర్నా చౌక్ కు వస్తున్న యానిమేటర్లను ఎక్కడికక్కడే అరెస్ట్ లు చేస్తూ ఎమర్జెన్సీని తలపించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

No comments:

Post a Comment