తొలిసారి బీజేపీని అధికారంలోకి తీసు కువచ్చిన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీవాజపేయికి ఆయన పుట్టిన రోజు సందర్భంగా అమూల్యమైన కానుకను అందించనున్నారు. కవి,అసాధారణ వక్త, అమితమైన ప్రజాదరణ గల వాజపేయి డిసెంబర్ 25న జన్మించిన విషయం తెలిసిందే. అదే రోజు ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందించాలని నిర్ణయిస్తూ కేంద్రం ప్రకటన చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ ఎవర్నీ గుర్తించలేని స్థితిలో ఉన్న వాజపేయిని ప్రతి ఏడాది ఆయన పుట్టిన రోజున పార్టీ అగ్రనేతలు సందర్శించడం, ఆ పుట్టిన రోజును ఘనంగా జరుపుకోవడం బీజేపీ కొనసాగిస్తూ వస్తోంది
No comments:
Post a Comment