కొత్తూరు : వలసల జిల్లాగా మారిన పాలమూరు జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు తెలిపారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం వారు బుధవారం తొలిసారిగా జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా కొత్తూరు మండలం తిమ్మాపూర్ చెక్పోస్టు వద్ద షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వీర్లపల్లి శంకర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వారికి ఘనంగా స్వాగతం పలికారు.
No comments:
Post a Comment