హైదరాబాద్: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలంగాణపై మరోసారి కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ శాసన మండలి పక్ష ఉప నేత పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపేసుకున్నారని విమర్శించారు. వెంకయ్యనాయుడు తాజాగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో లొసుగులున్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, దీని వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. రాజ్యసభలో విభజన చట్టం ఆమోదం పొందే సందర్భంలో తాను కూలంకషంగా పరిశీలించి, ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగేలా చూశానంటూ అప్పట్లో వెంకయ్య చెప్పుకున్నారని గుర్తు చేశారు.
No comments:
Post a Comment