ప్రజాసేవకు అంకితమైన గొట్టిపాటి కుంటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా యద్దనపూడిలో గురువారం దివంగత నేత గొట్టిపాటి నరసయ్య కాంస్య విగ్రహం ఆ విష్కరించిన తర్వాత మాట్లాడారు. వర్షం సైతం లెక్క చేయకుండా ఇక్కడకు వచ్చారంటే గొట్టిపాటి కుటుంబంపై ప్రజలకు ఎంత ఆప్యాయత ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. గొట్టిపాటి కుటుంబం, వైఎస్ కుటుంబం ఒకే కుటుంబ సభ్యులుగా మెలుగుతామని జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, నరసయ్య తనయుడు భరత్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment