photo gallery

 

Thursday, December 18, 2014

బాబు..వెంకటరమణను సింగపూర్ తీసుకెళ్లి ఉంటే..

హైదరాబాద్ :  తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. గురువారం సభ ప్రారంభమైన వెంటనే వెంకటరమణ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడుతూ  సింగపూర్‌ పర్యటనకు కార్పొరేట్‌ సంస్థలను తీసుకెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు...వైద్య చికిత్స కోసం వెంకటరమణను సింగపూర్‌ తీసుకెళ్లి ఉంటే... ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని  అన్నారు. విధి అనేది ఎవరూ ఆపలేకపోయారని.. ఆయన మరణం నిజంగా బాధాకరమన్నారు.

No comments:

Post a Comment