photo gallery

 

Friday, December 12, 2014

పింఛను పోరు..హోరు

పింఛన్ల పంపిణీని అడ్డుకోవటంపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలు బాహాబాహీకి దిగడంతో నల్లగొండలో ఉద్రిక్తత నెలకొంది. భువనగిరి ప్రాంత కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పోతంశెట్టి వెంకటేశ్వర్లు అనుచరులు.. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని గురువారమిక్కడ అడ్డుకున్నారు. కొంతమంది వృద్ధులను ముందు పెట్టి ‘‘వీరికి పింఛను ఎందుకు ఇవ్వరంటూ పోతంశెట్టి, అతని అనుచరులు.. శేఖర్‌రెడ్డిని గట్టిగా నిలదీశారు. ఈ సమయంలో ఇరుపక్షాలూ వాగ్వివాదానికి దిగగా, అది తోపులాటకు దారి తీసింది. పోలీసు జోక్యంతో ఇరువర్గాలు శాంతించాయి. రంగారెడ్డిలో ‘ఆసరా’ లబ్ధిదారులు అధికారులకు ముచ్చెమటలు పోయించారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలంటూ.. యాచారం మండల పరిషత్‌ కార్యాలయం భవనంపైకి చేరుకొని వృద్ధులు నిరసన తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం నెర్రెపల్లిలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు.

No comments:

Post a Comment