అంతర్జాతీయ స్థాయిలో నవ్యాంధ్ర రాజధాని నగర నిర్మాణానికి తొలి అడుగు పడింది. రాజధాని నిర్మాణానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించనున్న రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ-క్రీడా) బిల్లును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం శాసనసభలో ప్రవేశపెట్టింది. దీనిని శాసనసభ ఆమోదించిన తర్వాత ఇది ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ చట్టం -2014’గా మారుతుంది. అనంతరం భూ సమీకరణ నుంచి రాజధాని నిర్మాణం వరకూ కార్యాచరణ వేగవంతం అవుతుంది.
No comments:
Post a Comment